యాప్నగరం

ట్రైన్‌లో అమ్మాయితో టీటీఈ అసభ్య ప్రవర్తన..!

అలహాబాద్- జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న యువతిని టీటీఈ లైంగికంగా వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Samayam Telugu 13 Jul 2018, 9:24 am
అలహాబాద్- జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న యువతిని టీటీఈ లైంగికంగా వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బెర్తులు ఖాళీగా లేవు.. తన బెర్తులో పడుకోమని తొలుత చెప్పిన టీటీఈ.. ఆ తర్వాత తన పక్కన పడుకుని అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు అలహాబాద్‌‌లోని గవర్నమెంట్ రైల్వే పోలీస్ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో.. టీటీఈని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu 201602190006214200491


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని తన స్నేహితురాలని కలిసేందుకు యువతి (18) అహ్మదాబాద్‌ నుంచి అలహాబాద్- జైపూర్ ఎక్స్‌ప్రెస్‌‌లో రైలులో బయల్దేరింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో.. టికెట్లను తనిఖీలు చేసేందుకు టీటీఈ నాయక్ సింగ్ యువతి ఉన్న బోగీ‌లోకి వచ్చాడు. ఆ సమయంలో యువతి తన వద్ద ఆర్‌ఏసీ (రిజర్వేషన్‌ అగైనెస్ట్ క్యాన్సలేషన్) టికెట్‌ని అతనికి చూపించి బెర్తుని కేటాయించాల్సిందిగా కోరింది. ప్రస్తుతానికి బెర్తులు ఖాళీ లేవని చెప్పిన నాయక్ సింగ్.. తనకు కేటాయించిన బెర్తులో పడుకోమని వివరాలు చెప్పి.. టికెట్ల తనిఖీ కోసం తర్వాత బోగికి వెళ్లిపోయాడు.

టీటీఈకి కేటాయించిన బెర్తులో యువతి పడుకుని ఉండగా.. కాసేపటి తర్వాత అక్కడికి వచ్చిన నాయక్ సింగ్.. ఖాళీ బెర్తులు దొరకలేదని.. ఇద్దరం కలిసి ఈ బెర్తునే షేర్ చేసుకుందామని పక్కన పడుకున్నాడు. అనంతరం బోగీలోని లైట్లను ఆపేసి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో.. కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్ చేసి యువతి ఫిర్యాదు చేయగా.. టీటీఈ అదుపులోకి తీసుకున్నారు. టీటీఈని విధుల నుంచి తప్పించామని.. శాఖాపరమైన విచారణకి కూడా ఆదేశించినట్లు ఆగ్రా డివిజన్ మేనేజర్ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.