యాప్నగరం

టీవీ ఛానెల్ ఎండీపై కేసు నమోదు

ఇంటీరియర్ డెకరేటర్ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో పోలీసులు ఓ టీవీ ఛానెల్ ఎండీపై కేసు నమోదు చేశారు.

Samayam Telugu 6 May 2018, 11:23 am
రిపబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్, ఎడిటర్ ఇన్‌చీఫ్ అర్నబ్ గోస్వామిపై రాయ్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్వయ్ నాయక్ అనే ఇంటీరియర్ డెకరేటర్ శనివారం ఉదయం ముంబై సమీపంలోని అలిభాగ్‌‌లో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అర్నబ్, ఫిరోజ్ షేక్, నితేష్ సర్దా కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని నాయక్ సూసైడ్ నోట్ రాశారు. దీంతో నాయక్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వీరి ముగ్గురిపై ఐపీసీ 306 కింద కేసు నమోదు చేశారు.
Samayam Telugu suicide


నాయక్ రిపబ్లిక్ టీవీ ఆఫీసులో ఇంటీరియర్ డిజైన్ పనులు చేశాడు. కానీ అతడికి డబ్బులు చెల్లించలేదని రాయ్‌గఢ్ అడిషనల్ ఎస్పీ సంజయ్ పాటిల్ తెలిపారు. కాగా ఈ ఆరోపణలను రిపబ్లిక్ టీవీ కొట్టిపారేసింది. అతడికి బాకీ లేమని, డబ్బు మొత్తం చెల్లించామని ఓ స్టేట్‌మెంట్ ద్వారా స్పష్టం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.