కేరళ లవ్ జిహాద్ కేసు ఊహించని మలుపు తిరిగింది. తాను భర్తతోనే ఉంటానని హదియా.. అలియాస్ అఖిలా అశోకన్ పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టుకు హాజరవడానికి శనివారం (నవంబంర్ 25) ఢిల్లీ బయల్దేరిన ఆమె విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. అఖిలపై దాడులు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో.. కొచ్చీ విమానాశ్రయంలో ఆమెకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. తాను ముస్లిమేనని, ఇకపై భర్తతోనే ఉంటానని ఆమె స్పష్టంచేసింది. మతం మార్చుకునే విషయంలో తనను ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపింది.
కేరళకు చెందిన అఖిల గతేడాది షఫీన్ జెహాన్ అనే ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన పేరును కూడా హదియాగా మార్చుకొని ఇస్లాం మతం స్వీకరించింది. ఆ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వివాహం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్రలో భాగమేనని వారు ఆరోపించారు. దీంతో ఈ ఉదంతం.. ‘లవ్ జిహాద్’ కేసుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. హదియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ చేపట్టగలుగుతామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. నవంబర్ 27 ఆమెను కోర్టుకు తీసుకురావాలని హదియా తండ్రిని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి బయల్దేరింది.
కేరళకు చెందిన అఖిల గతేడాది షఫీన్ జెహాన్ అనే ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన పేరును కూడా హదియాగా మార్చుకొని ఇస్లాం మతం స్వీకరించింది. ఆ పెళ్లిని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వివాహం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్రలో భాగమేనని వారు ఆరోపించారు. దీంతో ఈ ఉదంతం.. ‘లవ్ జిహాద్’ కేసుగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. హదియా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ చేపట్టగలుగుతామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. నవంబర్ 27 ఆమెను కోర్టుకు తీసుకురావాలని హదియా తండ్రిని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమె ఢిల్లీకి బయల్దేరింది.