యాప్నగరం

అమర్‌నాథ్‌ యాత్రలో విషాదం: ఇద్దరు తెలుగువారు మృతి!

పవిత్ర అమర్‌నాథ్ యాత్రంలో ఆదివారం (జులై 8) అపశ్రుతి చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు యాత్రికలు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 8 Jul 2018, 5:41 pm
పవిత్ర అమర్‌నాథ్ యాత్రంలో ఆదివారం (జులై 8) అపశ్రుతి చోటుచేసుకుంది. అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు యాత్రికలు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీభాయ్ (54) కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవీందర్ నాథ్ (72) ఉన్నారు. బాల్తాల్ బేస్ క్యాంప్ వద్ద గుండెపోటుతో లక్ష్మీబాయి మృతిచెందగా, అస్వస్థతతో శ్రీకాకుళం వాసి రవీంద్రనాథ్ మృతిచెందాడు. శ్రీనగర్‌లోని స్కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం మధ్యాహ్నం చనిపోయాడు.
Samayam Telugu amarnath


జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న వర్షాలతో ఇటీవల అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గాక యాత్రికులను అనుమతించారు. జూన్ 28న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 14కు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.