యాప్నగరం

వీడియో: కుక్క పట్ల అమానుష ప్రవర్తన.. మరో దారుణం

Maharashtra: కేరళలో ఏనుగు మృతిపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతుండగానే మహారాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. శునకం పట్ల ఇద్దరు వ్యక్తులు అమానవీయంగా ప్రవర్తించారు. దాన్ని బైక్ వెనకాల బంధించి కిలోమీటర్ దూరం లాక్కెళ్లారు.

Samayam Telugu 7 Jun 2020, 5:55 pm
కేరళలో గర్భిణి ఏనుగు మృతి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ మహారాష్ట్రలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ శునకాన్ని బైక్‌ వెనకాల కట్టేసి ఈడ్చుకెళ్లారు. సుమారు కిలోమీటర్ దూరం వరకు అలా ఈడ్చుకెళ్లారు. ఈ అమానవీయ ఘటనను బైక్ వెనకాల వస్తున్న వాహనదారులు తమ సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. శునకాన్ని బైక్‌కు కట్టేసి అత్యంత దారుణంగా ఈడ్చుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై నెటిజన్లు మండిపడుతున్నారు.
Samayam Telugu శునకాన్ని బైక్ వెనకాల ఈడ్చుకెళ్తున్న దృశ్యం
Dog dragged back bike


మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో వైరల్‌గా మారిన నేపథ్యంలో ఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై ‘జంతువులపై క్రూరత్వం నివారణ’ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Also Read: కేరళలో అదే తీరులో మరో ఏనుగు మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.