యాప్నగరం

రెండు బస్సులు ఢీ.. ఎగిరిపడ్డ డ్రైవర్.. లైవ్ వీడియో

Salem Bus Accident: తమిళనాడులోని సేలం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 18 May 2022, 9:59 pm
Samayam Telugu తమిళనాడు బస్సు ప్రమాదం
Two buses collied in Tamil Nadu's Salem
మిళనాడులోని సేలంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం దృశ్యాలివి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కాలేజీ బస్సు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు డ్రైవర్ పాటలు వింటూ బస్సు నడుపుతుండగా.. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో డ్రైవర్ సీట్లో నుంచి అమాంతం ఎగిరిపడ్డాడు. డ్రైవర్‌తో పాటు మరికొంత మంది ముందుకు తూలిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సేలం జిల్లా శంకరగిరిలోని కోజిపన్నైలో మంగళవారం (మే 17) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. ప్రైవేట్ కాలేజీకి చెందిన బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారని.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు వెల్లడించారు.

‘ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతమంతా కొండలతో కూడుకొని ఉంది. చాలా చోట్ల రోడ్డు మలుపు తిరిగి ఉంటుంది. కాలేజీ బస్సు డ్రైవర్ కొత్తగా చేరినట్లు తెలిసింది. ఆ రూట్లో ఇంతకుముందెన్నడూ డ్రైవింగ్ చేసిన అనుభవం అతడికి లేదు. అందువల్ల అతడు వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో కాలేజీ బస్సు.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టింది’ అని కొంగనపురమ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ప్రమాద సమయంలో కాలేజీ బస్సు ఎడప్పాడి వైపు వస్తుండగా.. ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో తిరుచెంగోడె వైపు వస్తోంది.

గాయపడిన 18 మందిలో ముగ్గురు తప్ప అందరూ డిశ్చార్జ్ అయ్యి, ఇళ్లకు వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Also Read:

చైనా విమానాన్ని పైలట్లే కూల్చేశారా..?

పేలిన పెళ్లి కానుక.. చెయ్యిని కోల్పోయిన కొత్త పెళ్లికొడుకు
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.