యాప్నగరం

గుంపు నుంచి దూరమై.. పట్టాలపై బలైన గున్న ఏనుగులు

రైలు ఢీకొనడంతో రెండు ఏనుగు పిల్లలు మృత్యువాత పడిన ఘటన పశ్చిమ కనుమల్లోని దట్టమైన అడవుల్లో చోటు చేసుకుంది.

Samayam Telugu 5 Jun 2018, 3:13 pm
రైలు ఢీకొనడంతో రెండు ఏనుగు పిల్లలు మృత్యువాత పడిన ఘటన పశ్చిమ కనుమల్లో చోటు చేసుకుంది. కర్ణాటకలోని యెడకుమరి రైల్వే స్టేషన్‌కు 10 కి.మీ. దూరంలో దట్టమైన అడవుల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో పట్టాలు దాటే క్రమంలో ఏనుగు పిల్లలను గూడ్స్ రైలు ఢీకొట్టి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ఒక ఏనుగు పిల్లల్లో ఒకదాని వయసు 8 నెలలు, మరొక దాని వయసు ఏడాదిన్న ఉండొచ్చని అధికారులు చెప్పారు.
Samayam Telugu elephant1


సుబ్రమణ్య, యెడకుమరి స్టేషన్ల మధ్య దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని హసన్ డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటర్ శివరాం బాబు తెలిపారు. సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం చేసి వాటిని ఖననం చేశామని ఆయన చెప్పారు. సాధారణంగా ఏనుగు పిల్లలు గుంపు నుంచి బయటకు రావు. కానీ ఇవి ఇలా మంద నుంచి ఎందుకు దూరంగా వచ్చాయో తెలీదని అటవీశాఖాధికారి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.