యాప్నగరం

కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు హతమార్చాయి.

TNN 4 Feb 2017, 5:38 pm
కాశ్మీర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు హతమార్చాయి. శనివారం ఉత్తర కాశ్మీర్ లోని సొపోరే ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు తిరుగుతున్నట్టు ఆర్మీకి సమాచారం అందింది. ఓ వాహనంలో ఉగ్రవాదులు వెళుతున్నట్టు, వారి దగ్గర అత్యాధునిక ఆయుధాలు కూడా ఉన్నట్టు సమాచారం వచ్చింది. వెంటనే స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సొపొరే ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులను చూడగానే ఉగ్రవాదులు గ్రెనేడ్ ను విసిరి, వెంటనే కాల్పులు జరపడం ప్రారంభించారు. ఆ కాల్పుల్లో ఎస్పీ షఫ్కత్ హుస్సేన్, ఎస్‌ఐ మొహమ్మద్ ముర్తజా తీవ్రంగా గాయపడ్డారు.
Samayam Telugu two hizbul mujahideen terrorists killed in encounter in kashmir
కాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం


అనంతరం పోలీసులు, భద్రతా సిబ్బంది కూడా ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. వారిద్దరూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. వారి వద్ద నుంచి రెండు ఏకే సిరీస్ రైఫిల్స్, ఒక తుపాకి, 4 హ్యాండ్ గ్రెనేడ్లు లభమయ్యాయి. మరణించిన ఇద్దరు ఉగ్రవాదులను కుప్వారాకు చెందిన అజార్ ఖాన్, సొపొరేకు చెందిన సజ్జద్ అహ్మద్ లోనే గా గుర్తించారు. వీరిలో సజ్జద్ గతేడాది మార్చిలో వాఘా బోర్డర్ నుంచి పాక్ లోకి ప్రవేశించి, ఉగ్ర శిక్షణ తీసుకున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.