యాప్నగరం

నదిలో పడిపోయిన వాహనం.. జవాన్లు మిస్సింగ్

Himachal Pradesh: ఐటీబీపీ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో పడిపోయింది. ముగ్గరు జవాన్లు గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 25 Aug 2020, 4:08 pm
టీబీపీ (ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) జవాన్లు ప్రయాణిస్తున్న ఓ వాహనం ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులతో పాటు డ్రైవర్ గల్లంతయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో మంగళవారం (ఆగస్టు 25) మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గల్లంతైన వారిలో రైఫిల్‌మ్యాన్ నీమా దొంధూప్ ఉన్నారు. ఆయన అరుణాచల్ ప్రదేశ్‌కు చెందినవారు.
Samayam Telugu సట్లెజ్ నదిలో సైనికులు మిస్సింగ్
Two ITBP personnel including Rifleman Neema Dhondhup from Arunachal Pradesh and a driver missing after an ITBP vehicle rolled down into Sutlej river at Spilo in Kinnaur district (Photo: ANI)


ఐటీబీపీ జవాన్లు తమ విధుల్లో భాగంగా వాహనంలో వెళ్తుండగా కిన్నౌర్ జిల్లాలోని స్పిలో వద్ద ప్రమాదం జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ సట్లెజ్ నదిలోకి దూసుకెళ్లింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. గల్లంతైన జవాన్ల కోసం గాలిస్తున్నట్లు కిన్నౌర్ ఎస్పీ ఎస్.ఆర్. రానా తెలిపారు.

Also Read: ఉగ్రవాదులకు వైద్య సేవలు.. బెంగళూరులో యువ డాక్టర్ అరెస్ట్
Must Read: రోడ్లపైనే నిద్ర.. జపాన్‌లో మాయ రోగం, మహిళలు కూడా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.