వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని వాటిని చెల్లించని కారణంగా కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను బ్యాంకులు జప్తు చేశాయి. వాటిలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు ప్రాథమిక ఆస్తులను సోమవారం మరోసారి వేలం వేయనున్నారు. ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్, గోవాలోని విల్లాలను గతంలో వేలానికి పెట్టినా బ్యాంకులు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు.
దీంతో ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్ ప్రారంభం ధరను రూ.115 నుంచి రూ.103.5 కోట్లకు ఎస్బీఐ తగ్గించింది. గతేడాది మార్చిలో దీన్ని తొలిసారిగా వేలానికి పెట్టారు. అప్పట్లో దాని విలువ రూ.150 కోట్లు, రెండోసారి ఆగస్టులో రూ.135 కోట్లు, డిసెంబరులో రూ.115 కోట్లుగా నిర్ణయించినా కొనడానికి మాత్రం ఎవరూ ఆసక్తి చూపలేదు. 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవంతి విల్ పర్లే ఏరియా డొమెస్టిక్ టెర్మినల్కు సమీపంలో ఉంది.
ఇక నార్త్ గోవాలోని కండోలిమ్లో ఉన్న విల్లా విలువను కూడా 10 శాతం తగ్గించారు. గత డిసెంబరు వేలంలో దీని ధర రూ.81 కోట్లు, అయితే ప్రస్తుతం దీని విలువ రూ.73 కోట్లుగా నిర్ణయించారు. గతేడాది అక్టోబరులో దీన్ని తొలిసారిగా వేలానికి ఉంచినప్పుడు గరిష్ఠంగా రూ.85.29 కోట్లు విలువను ప్రకటించారు. ఈ విల్లాను విజయ్ మాల్యా తన విలాసవంతమైన పార్టీల కోసం వినియోగించేవారు.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ తరఫున వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని మాల్యా చెల్లించలేదు. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల నుంచి సుమారూ రూ.9 వేల కోట్లు రుణంగా తీసుకుని వాటికి ఎగనామం పెట్టాడు. గత మార్చి 3 నుంచి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా బ్రిటన్లో ఉంటున్నట్లు సమాచారం.
తన ఎయిర్లైన్స్ పతనం కావడానికి విమానాల్లోని లోపభూయిష్టమైన ఇంజిన్లే ప్రధాన కారణమంటూ మాల్యా తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుక్రవారం పలు ట్వీట్స్ చేశాడు. అంతే కాదు దీనిపై ప్రాట్ అండ్ విట్నే సంస్థపై దర్యాప్తునకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించాలని కూడా కోరాడు.
దీంతో ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్ ప్రారంభం ధరను రూ.115 నుంచి రూ.103.5 కోట్లకు ఎస్బీఐ తగ్గించింది. గతేడాది మార్చిలో దీన్ని తొలిసారిగా వేలానికి పెట్టారు. అప్పట్లో దాని విలువ రూ.150 కోట్లు, రెండోసారి ఆగస్టులో రూ.135 కోట్లు, డిసెంబరులో రూ.115 కోట్లుగా నిర్ణయించినా కొనడానికి మాత్రం ఎవరూ ఆసక్తి చూపలేదు. 17 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ భవంతి విల్ పర్లే ఏరియా డొమెస్టిక్ టెర్మినల్కు సమీపంలో ఉంది.
ఇక నార్త్ గోవాలోని కండోలిమ్లో ఉన్న విల్లా విలువను కూడా 10 శాతం తగ్గించారు. గత డిసెంబరు వేలంలో దీని ధర రూ.81 కోట్లు, అయితే ప్రస్తుతం దీని విలువ రూ.73 కోట్లుగా నిర్ణయించారు. గతేడాది అక్టోబరులో దీన్ని తొలిసారిగా వేలానికి ఉంచినప్పుడు గరిష్ఠంగా రూ.85.29 కోట్లు విలువను ప్రకటించారు. ఈ విల్లాను విజయ్ మాల్యా తన విలాసవంతమైన పార్టీల కోసం వినియోగించేవారు.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ తరఫున వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని మాల్యా చెల్లించలేదు. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల నుంచి సుమారూ రూ.9 వేల కోట్లు రుణంగా తీసుకుని వాటికి ఎగనామం పెట్టాడు. గత మార్చి 3 నుంచి దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా బ్రిటన్లో ఉంటున్నట్లు సమాచారం.
తన ఎయిర్లైన్స్ పతనం కావడానికి విమానాల్లోని లోపభూయిష్టమైన ఇంజిన్లే ప్రధాన కారణమంటూ మాల్యా తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుక్రవారం పలు ట్వీట్స్ చేశాడు. అంతే కాదు దీనిపై ప్రాట్ అండ్ విట్నే సంస్థపై దర్యాప్తునకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించాలని కూడా కోరాడు.