జమ్మూకశ్మీర్లో మరో ఎన్కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. టెర్రరిస్టుల ఉన్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తోన్న సమయంలో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయని, ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ప్రధానాంశాలు:
- కుల్గామ్ జిల్లాలో ఎదురు కాల్పులు
- సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఘటన
- మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో సోమవారం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. నౌపోరా-ఖర్పోరా త్రుబ్జీ ప్రాంతంలో తెల్లవారుజామున కాల్పులు ప్రారంభమయ్యాయి. ఎన్కౌంటర్ స్థలం నుంచి ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. నౌపోరా-ఖేర్పోరాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారని, ఫలితంగా ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో చనిపోయిన ఉగ్రవాదులు ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. ఆ ప్రాంతంలో మరికొంతమంది ఉగ్రవాదులు దాగి ఉండవచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.
ఇదిలాఉండగా ఈ ఏడాది కశ్మీర్లోయలో 70కిపైగా ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో 120 మంది ఉగ్రవాదులు మరణించారు. మృతి చెందిన 120 మందిలో 33 మంది విదేశీయులు ఉన్నారు. ఎక్కువగా పాకిస్థానీలు ఉన్నారు. అలాగే వివిధ ఎన్కౌంటర్లలో 16 మంది భద్రతా సిబ్బంది, 19 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే జమ్మూ కశ్మీర్ పోలీసులు 46 మంది యాక్టివ్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. 192 మంది గ్రౌండ్ వర్కర్లను కూడా ఈ ఏడాది అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలాఉండగా ఈ ఏడాది కశ్మీర్లోయలో 70కిపైగా ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో 120 మంది ఉగ్రవాదులు మరణించారు. మృతి చెందిన 120 మందిలో 33 మంది విదేశీయులు ఉన్నారు. ఎక్కువగా పాకిస్థానీలు ఉన్నారు. అలాగే వివిధ ఎన్కౌంటర్లలో 16 మంది భద్రతా సిబ్బంది, 19 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే జమ్మూ కశ్మీర్ పోలీసులు 46 మంది యాక్టివ్ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. 192 మంది గ్రౌండ్ వర్కర్లను కూడా ఈ ఏడాది అదుపులోకి తీసుకున్నారు.