యాప్నగరం

ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి.

TNN 7 Jun 2021, 6:32 am
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. గురువారం తెల్లవారుజామున సోపోర్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. ఇంకా ఆ ప్రాంతంలో ఎక్కడైనా ఉగ్రవాదులు దాక్కున్నారేమో అన్న అనుమానంతో వెతుకుతున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల మేరకు గురువారం రాత్రి ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నట్టు సమాచారం వచ్చింది. దీంతో స్థానిక పోలీసులు కార్డన్ సెర్చ్ ప్రారంభించారు.
Samayam Telugu two terrorists killed in sopore in jammu and kashmir
ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ


ప్రతి ఇంట్లోకి వెళ్లి తనఖీలు చేశారు. ఇలా చేస్తుండగానే ఒక ఇంట్లోంచి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతాదళాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. దాదాపు మూడు గంటల పాటూ కాల్పులు కొనసాగాయి. ఉదయం ఆరున్న ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది సైన్యం. వారిద్దరి దగ్గర రెండు ఏకే -47 రైఫిల్స్, 107 రౌండ్స్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సహకారంతోనే ఉగ్రవాదులను కనిపెట్టగలిగినట్టు అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.