ఆధార్ నంబర్ పొందాలంటే ఇప్పటి వరకు మనం కంటి రెటీనా, వేలిముద్రలు మాత్రమే ఇచ్చేవాళ్లం. ఇకపై ముఖ గుర్తింపు (ఫేషియల్ అథెంటికేషన్) కూడా చేసుకోవాలి. ఈ మేరకు ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్తగా ఫేషియల్ అథెంటికేషన్ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) వెల్లడించింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్లో ప్రజలకు వస్తున్న సమస్యలను పరిష్కరించేందుకే ఈ కొత్త విధానాన్ని కూడా తీసుకువస్తున్నట్లు యూఐడీఏఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ గుర్తింపు ఫీచర్ను వేలిముద్రలు, ఐరిస్ లేదా ఓటీపీల్లో ఏదో ఒకదానితో కలిపి పనిచేసేలా తీర్చిదిద్దుతున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది. చాలా మంది వృద్ధులు, ఎక్కువగా పనిచేసేవారు తమ వేలిముద్రలను కోల్పోతున్నారు. అలాంటి వారికి బయోమెట్రిక్ గుర్తింపు పరీక్ష కష్టమైపోతోంది. కొన్ని సమయాల్లో అసలు వారి వేలిముద్రలు పనిచేయడం లేదు. ఇలాంటి వారికి ముఖ గుర్తింపు ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని యూఐడీఏఐ తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఆధార్ సిస్టమ్లో భద్రపరిచిన వేలిముద్రలు, ఐరిస్ డాటాను దొంగిలించడం అసాధ్యమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవలే భరోసా ఇచ్చారు. ‘ఆధార్ సిస్టమ్లో నా వేలిముద్రలు, ఐరిస్ను భద్రంగా ఉన్నాయి. కొన్ని లక్షల సార్లు ప్రయత్నించినా దొంగిలించలేనంత భద్రంగా ఉన్నాయి. అదీ ఇండియన్ టెక్నాలజీ అంటే’ అని ఆయన వివరించారు. ఆధార్ డాటా చోరీకి గురైందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.
ముఖ గుర్తింపు ఫీచర్ను వేలిముద్రలు, ఐరిస్ లేదా ఓటీపీల్లో ఏదో ఒకదానితో కలిపి పనిచేసేలా తీర్చిదిద్దుతున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది. చాలా మంది వృద్ధులు, ఎక్కువగా పనిచేసేవారు తమ వేలిముద్రలను కోల్పోతున్నారు. అలాంటి వారికి బయోమెట్రిక్ గుర్తింపు పరీక్ష కష్టమైపోతోంది. కొన్ని సమయాల్లో అసలు వారి వేలిముద్రలు పనిచేయడం లేదు. ఇలాంటి వారికి ముఖ గుర్తింపు ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని యూఐడీఏఐ తెలిపింది.
ఇదిలా ఉంటే.. ఆధార్ సిస్టమ్లో భద్రపరిచిన వేలిముద్రలు, ఐరిస్ డాటాను దొంగిలించడం అసాధ్యమని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఇటీవలే భరోసా ఇచ్చారు. ‘ఆధార్ సిస్టమ్లో నా వేలిముద్రలు, ఐరిస్ను భద్రంగా ఉన్నాయి. కొన్ని లక్షల సార్లు ప్రయత్నించినా దొంగిలించలేనంత భద్రంగా ఉన్నాయి. అదీ ఇండియన్ టెక్నాలజీ అంటే’ అని ఆయన వివరించారు. ఆధార్ డాటా చోరీకి గురైందని వచ్చిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ఈ విధంగా స్పందించారు.