కేంద్ర జలవనరుల మంత్రి ఉమా భారతి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేపిస్టులకు నరకం చూపించారట. ఈ విషయాన్ని ఆమె ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు.
‘‘క్షమాపణ కోరేంత వరకు బాధితుల ముందే రేపిస్టులను ఘోరంగా హింసించాలి. నేను సీఎంగా ఉన్నప్పుడు అలాగే చేశా’’ అని ఆమె గురువారం ఆగ్రాలో అన్నారు.
గతేడాది ఢిల్లీలో సమీపంలోని బులందర్ షార్ ఓ తల్లి ఆమె కూతురిపై జరిగిన సామూహిక అత్యాచారంపై స్పందిస్తూ ఉమాభారతి ఈ వ్యాఖ్యలు చేశారు. బులందర్ షార్ గ్యాంగ్ రేపిస్టులకు బెయిల్ పై బయటికి వచ్చినా అఖిలేష్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని, ఎస్పీ హయంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు.
‘‘వాళ్ల (రేపిస్టులు)ను తలకిందులుగా వేలాడదీసి కొట్టాలి. ఆ గాయాలపై ఉప్పు, కారం పోయాలి. ఆ బాధకు వాళ్లు పెడ బొబ్బలు పెట్టాలి. రేపిస్టుల ఏడ్పులను మహిళలంతా వినాలి’’ అని ఉమ అన్నారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు రేపిస్టులను ఘోరంగా హింసించాలని పోలీసులకు చెప్పేదాన్ని అని ఆమె గుర్తు చేశారు. రేపిస్టులను పోలీసులు చితకబాధేటప్పుడు వారిని మహిళలు చూసేలా పోలీస్ స్టేషన్లకు రప్పించాలని చెప్పినట్లు ఉమ పేర్కొన్నారు.
ఇలా చేస్తే రేపిస్టులు వారికి పడే శిక్షలకు భయపడి వేరొకరు అలా చేయకుండా ఉంటారని ఆమె అన్నారు.
అయితే తాను ఇలా ఆదేశాలిచ్చినప్పుడు ఓ పోలీసు ఆఫీసు అడ్డుపడ్డారని చెప్పిన ఉమ..‘‘రాక్షసుల్లా ప్రవర్తించేవాళ్లకు మానవ హక్కలుండవు. వారి తలలు రావణుడి తల నరికినట్లు నరికేయాలి’’ అని చెప్పినట్లు పేర్కొన్నారు.
అగ్గి బరాటగా పేరున్న ఉమా భారతి..ఏ అంశంపైనా అయినా ఇలాగే మాట్లాడతారు. ఎల్వోసీలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్ చేసినప్పుడు..అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ‘ఆధారాలు’ కావాలని డిమాండ్ చేసినప్పుడు..అలాంటి వాళ్లు పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవాలని మండిపడ్డారు.
‘‘క్షమాపణ కోరేంత వరకు బాధితుల ముందే రేపిస్టులను ఘోరంగా హింసించాలి. నేను సీఎంగా ఉన్నప్పుడు అలాగే చేశా’’ అని ఆమె గురువారం ఆగ్రాలో అన్నారు.
గతేడాది ఢిల్లీలో సమీపంలోని బులందర్ షార్ ఓ తల్లి ఆమె కూతురిపై జరిగిన సామూహిక అత్యాచారంపై స్పందిస్తూ ఉమాభారతి ఈ వ్యాఖ్యలు చేశారు. బులందర్ షార్ గ్యాంగ్ రేపిస్టులకు బెయిల్ పై బయటికి వచ్చినా అఖిలేష్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని, ఎస్పీ హయంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు.
‘‘వాళ్ల (రేపిస్టులు)ను తలకిందులుగా వేలాడదీసి కొట్టాలి. ఆ గాయాలపై ఉప్పు, కారం పోయాలి. ఆ బాధకు వాళ్లు పెడ బొబ్బలు పెట్టాలి. రేపిస్టుల ఏడ్పులను మహిళలంతా వినాలి’’ అని ఉమ అన్నారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు రేపిస్టులను ఘోరంగా హింసించాలని పోలీసులకు చెప్పేదాన్ని అని ఆమె గుర్తు చేశారు. రేపిస్టులను పోలీసులు చితకబాధేటప్పుడు వారిని మహిళలు చూసేలా పోలీస్ స్టేషన్లకు రప్పించాలని చెప్పినట్లు ఉమ పేర్కొన్నారు.
ఇలా చేస్తే రేపిస్టులు వారికి పడే శిక్షలకు భయపడి వేరొకరు అలా చేయకుండా ఉంటారని ఆమె అన్నారు.
అయితే తాను ఇలా ఆదేశాలిచ్చినప్పుడు ఓ పోలీసు ఆఫీసు అడ్డుపడ్డారని చెప్పిన ఉమ..‘‘రాక్షసుల్లా ప్రవర్తించేవాళ్లకు మానవ హక్కలుండవు. వారి తలలు రావణుడి తల నరికినట్లు నరికేయాలి’’ అని చెప్పినట్లు పేర్కొన్నారు.
అగ్గి బరాటగా పేరున్న ఉమా భారతి..ఏ అంశంపైనా అయినా ఇలాగే మాట్లాడతారు. ఎల్వోసీలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్ చేసినప్పుడు..అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు ‘ఆధారాలు’ కావాలని డిమాండ్ చేసినప్పుడు..అలాంటి వాళ్లు పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవాలని మండిపడ్డారు.