యాప్నగరం

కశ్మీర్: భూగర్భంలో ఉగ్రవాదుల రహస్య స్థావరం..

Terrorist Hideout: లష్కరే తొయిబా ఉగ్రవాదులు భూగర్భంలో ఏర్పాటు చేసుకున్న రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. అక్కడ నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Samayam Telugu 17 Oct 2020, 1:01 am
మ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఎలాంటి సవాళ్లు విసురుతున్నారో చెప్పడానికి తార్కాణంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రతా దళాలు కళ్లుగప్పి ముష్కరులు భూగర్భంలో రహస్యంగా స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థావరాన్ని భద్రతా దళాలు గురువారం (అక్టోబర్ 15) గుర్తించాయి.
Samayam Telugu ఉగ్రవాదుల రహస్య స్థావరం
LeT Terrorists Hideout


నిఘా వర్గాల సమాచారం మేరకు 55 రాష్ట్రీయ రైఫిల్స్, 185 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్‌తో కలిసి అవంతిపొరా పోలీసులు గురువారం కవాని ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన రహస్య భూగర్భ స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేశారు.


ఉగ్రవాదుల భూగర్భ స్థావరం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి, 2091 రౌండ్ల ఏకే -47 మందుగుండు, ఒక పిస్టల్, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల రహస్య భూగర్భ స్థావరానికి సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేశారు.

Also Read: శౌర్య చక్ర, ఉగ్రవాదుల పాలిట సింహస్వప్నం బల్వీందర్ సింగ్ హత్య

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.