యాప్నగరం

ప్రధానికి లేఖ రాసిన యూపీ సీఎం అఖిలేష్

ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్ ను వాయిదా వేయాలని కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్

Samayam Telugu 27 Jan 2017, 11:46 am
ఫిబ్రవరి ఒకటో తారీఖున కేంద్ర బడ్జెట్ ను వాయిదా వేయాలని కోరుతూ ఉత్తర్ ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శుక్రవారం లేఖ రాశారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో వివిధ విడతల్లో ఫిబ్రవరి 4 నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెట్టి అధికార బీజేపీ ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తోందని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu union budget on february 1 is unfair writes akhilesh yadav to pm narendra modi
ప్రధానికి లేఖ రాసిన యూపీ సీఎం అఖిలేష్


అయితే కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఏలాంటి అదనపు కేటాయింపులు గానీ, ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రత్యేక రాయితీలు గానీ ఇవ్వరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

దీంతో అఖిలేష్ మోదీకి లేఖ రాశారు. ‘‘యూపీ ఎన్నికల సమయంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే.. రాష్ట్రానికి దక్కే కేటాయింపుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని’’ అఖిలేష్ లేఖలో పేర్కొన్నారు.

ఫిబ్రవరి 11 నుంచి యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

ఇదిలా ఉండగా జనవరి 30 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.