యాప్నగరం

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

వ్యవసాయం రంగంలో కొత్త పథకం. బ్రాడ్ గేజ్ రైలు మార్గాలను 2021-2022నాటి కల్లా విద్యుదీకరణ. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు

Samayam Telugu 12 Sep 2018, 8:29 pm
ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశమయ్యింది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పేరుతో వ్యవసాయ రంగంలో కొత్త పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న బ్రాడ్ గేజ్ రైలు మార్గాలను 2021-2022నాటి కల్లా విద్యుదీకరణ చేయాలని నిర్ణయించారు. ఇథనాల్ ధరను రూ.47.49 నుంచి రూ.52.43కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేబినెట్.
Samayam Telugu Cabinet


విజయవాడ, జోర్‌హాట్, భోపాల్, కురుక్షేత్రలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఏపీ రాజధానిలో ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌కు అమరావతి ఎన్‌ఐడీగా పేరును మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ప్రాధాన్యత గల విద్యాసంస్థగా గుర్తింపును కూడా ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.