యాప్నగరం

మోదీ కేబినెట్: 13 మంది మంత్రుల ప్రమాణం

కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ పూర్తయింది. కేంద్ర మంత్రులుగా మొత్తం 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు.

TNN 3 Sep 2017, 11:23 am
కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ పూర్తయింది. కేంద్ర మంత్రులుగా మొత్తం 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో ఆదివారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వీరితో ప్రమాణం చేయించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారిలో కొత్తవారు 9 మంది ఉన్నారు. మొదటిగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేశారు. ఆ తరవాత పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఇప్పటి వరకు సహాయమంత్రులుగా ఉన్న నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీలకు కేబినెట్‌ హోదా కల్పించినట్లయింది.
Samayam Telugu union cabinet reshuffle 13 ministers takes oath
మోదీ కేబినెట్: 13 మంది మంత్రుల ప్రమాణం


ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు ఖరారైన జాబితాలో ఉన్న 9 మంది ఎంపీలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వరసగా శివప్రతాప్ శుక్లా, అశ్వినీకుమార్ చౌబే, వీరేంద్ర కుమార్, అనంత్ కుమార్ హెగ్డే, రాజ్‌కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, గజేంద్ర సింగ్ షెకావత్, సత్యపాల్ సింగ్, అల్ఫోన్స్‌ కన్నంథనం సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.