యాప్నగరం

కేంద్ర కేబినెట్‌లో మార్పులు..గోయల్‌కు ఆర్థికశాఖ

కేంద్రమంత్రి వర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతల్ని రైల్వేశాఖ మంత్రిగా ఉన్న గోయల్‌కు అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 14 May 2018, 10:30 pm
కేంద్రమంత్రి వర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. కీలకమైన ఆర్థికశాఖ బాధ్యతల్ని రైల్వేశాఖ మంత్రిగా ఉన్న గోయల్‌కు అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. అంతకముందు ఈ బాధ్యతలను చూస్తున్న అరుణ్ జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. డాక్టర్ల సూచనతో ఇవాళే కిడ్నీ మార్పిడి చికిత్స కూడా జరిగింది. అయితే ఆయన కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు. దీంతో ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు బాధ్యతల్ని గోయల్‌కు అప్పగించాలని ప్రధాని నిర్ణయించారు.
Samayam Telugu Rathod


మంత్రివర్గంలో ఆర్థికశాఖ మాత్రమే కాదు... మరో రెండు మార్పులు కూడా చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని సమాచార, ప్రసారాల శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. ఆమె స్థానంలో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌కు ఆ శాఖను అప్పగించారు. అయితే స్మృతి జౌళి శాఖ మంత్రిగా కొనసాగుతారు. కేవలం సమాచార, ప్రసారాల శాఖ బాధ్యతలు మాత్రమే దూరమయ్యాయి. రాథోడ్ ఇప్పటికే క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఎలక్ట్రానిక్ శాఖ బాధ్యతల నుంచి అల్ఫోన్స్ నుంచి తప్పించి... అహ్లువాలియాకు ఇచ్చారు. అహ్లువాలియా ఇప్పటికే తాగునీరు, శానిటేషన్‌శాఖ మంత్రిగా ఉన్నారు. అల్ఫోన్స్ సాంస్కృతిక మరియు పర్యాటకశాఖ మంత్రిగా కొనసాగుతారు.

పీయూష్ గోయల్‌కు ఆర్థికశాఖ బాధ్యతల్ని అప్పగించడం వరకు బాగానే ఉన్నా... మిగిలిన శాఖల్లో మార్పులు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా స్మృతి ఇరానీ మార్పు పెద్ద షాక్ అనే చెప్పాలి. దీని వెనుక మరో కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన సినీ జాతీయ అవార్డుల విషయంలో వివాదంతో ఈ నిర్ణయం తీసుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.