యాప్నగరం

Onion Price: ఉల్లి ధరలను తగ్గించడానికి కేంద్రం కీలక నిర్ణయం

ఉల్లిపాయ ధరలు పెరగకుండా చూడటం కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగుమతులను తక్షణమే నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ చర్య ద్వారా ఉల్లి ధరలు అదుపులో ఉంటాయని కేంద్రం భావిస్తోంది.

Samayam Telugu 29 Sep 2019, 4:09 pm
దేశవ్యాప్తంగా ఉల్లిపాయ ధరలు ఆకాశాన్ని అంటిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెలారంభంలో కిలో రూ.30కి మార్కెట్లో ఉల్లి లభించగా.. ఇప్పుడు కిలో ధర రూ.60-70 వరకు పలుకుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గిపోవడమే ఉల్లి ధరలు పెరగడానికి ప్రధాన కారణం. కాగా వ్యాపారులు ఉల్లిని దాచిపెట్టి కృతిమ కొరత సృష్టించడం, విదేశాలకు ఎగుమతి చేస్తుండటం కూడా ఉల్లి ధర పెరగడానికి కారణమైంది. ఉల్లికి ప్రభుత్వాలను కూలదోసిన చరిత్ర ఉండటంతో.. మోదీ సర్కారు అప్రమత్తమైంది.
Samayam Telugu onion


ఉల్లి ధరలు సామాన్యుడికి భారంగా మారడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ధరల్ని అదుపులోకి తేవడం కోసం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఉల్లిపాయల ఎగుమతి విధానానికి సవరణలు చేస్తున్నట్టు విదేశీ వాణిజ్యం డైరెక్టర్ జనరల్ అలోక్ వర్దన్ చతుర్వేదీ పేరిట ఆదివారం నోటిఫికేషన్ జారీ చేశారు.

ఉల్లి ఎగుమతులను తగ్గించడం కోసం పదిహేను రోజుల క్రితం టన్ను ఉల్లిపాయల కనీస ధర 850 డాలర్లుగా కేంద్రం నిర్ణయించింది. మన దేశం నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈలకు ఉల్లి ప్రధానంగా ఎగుమతి అవుతుంది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో 154.5 మిలియన్ డాలర్ల విలువైన ఉల్లిని భారత్ ఎగుమతి చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.