యాప్నగరం

పోలవరానికి రూ. 1981 కోట్ల నాబార్డ్ నిధులు

ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 1981.54 కోట్ల నిధులు మంజూరు చేసింది.

TNN 26 Dec 2016, 4:15 pm
Samayam Telugu union government released rs 1981 crores for polavaram project through nabard
పోలవరానికి రూ. 1981 కోట్ల నాబార్డ్ నిధులు
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ. 1981.54 కోట్ల నిధులు మంజూరు చేసింది. నాబార్డ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను అందజేస్తోంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి చేతుల మీదుగా నిధుల చెక్ అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉమాభారతి మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టుకు నాబార్డ్ ద్వారా తొలిసారి నిధులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. నాబార్డ్ మొట్టమొదటి సారి గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు ఇస్తోందని అరుణ్ జైట్లీ అన్నారు. జలవనరులను ఎంత వీలైతే అంత వినియోగించుకోవాలని, అప్పుడే రైతులు లాభపడతారని జైట్లీ చెప్పారు. నీటిపారుదల పథకాలకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.