ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన అనంతరం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెన్నైలో ఆమె చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి చెర్మైన్ ప్రతాప్ సి రెడ్డికి ఫోన్ చేశారు. ప్రస్తుతం జయ పరిస్థితి ఏంటని నేరుగా ఆస్పత్రి చైర్మన్నే వివరాలు అడిగి తెలుసుకున్నారు నడ్డా. ఆదివారం సాయంత్రం వరకు సాధారణ వార్డులోనే చికిత్స పొందుతున్న జయలలితను గుండెపోటు వచ్చిన తర్వాత ఐసీయుకి తరలించారు. లండన్తోపాటు ఢిల్లీలోని ఎయిమ్స్ నిపుణుల పర్యవేక్షణలోని డాక్లర్ల బృందం ప్రస్తుతం జయకు చికిత్స అందిస్తోంది. ఇంకొంతమంది వైద్య నిపుణులు కూడా ఎయిమ్స్ నుంచి చెన్నైలోని అపోలోకి చేరుకుంటున్నారని ఆదివారం రాత్రి అధికారిక వర్గాలు తెలిపాయి. ఇదిలావుంటే అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కూతురు, అపోలో హాస్పిటల్స్లోని కొన్ని విభాగాలకు హెడ్గా వ్యవహరిస్తున్న సంగీతా రెడ్డి ఆదివారం అర్థరాత్రి దాటాకా మరోమారు జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. తమ హాస్పిటల్లోని డాక్టర్ల బృందం జయలలితను కాపాడుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఈ ట్వీట్లో పేర్కొన్నారు.
Our doctors are closely monitoring Hon'ble CM's condition and they are trying their very best. #GodblessAmma @HospitalsApollo— Sangita Reddy (@SangitaApollo) December 4, 2016
Our doctors are closely monitoring Hon'ble CM's condition and they are trying their very best. #GodblessAmma @HospitalsApollo— Sangita Reddy (@SangitaApollo) December 4, 2016