యాప్నగరం

వలస కార్మికులకు భారీ ఊరట.. రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

దేశమంతటా లాక్‌డౌన్ విధించడంతో ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్లిన వారు తిరిగి సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరుతోంది.

Samayam Telugu 28 Mar 2020, 8:02 pm
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశమంతటా మూడు వారాలపాటు లాక్‌డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని, కోవిడ్ కట్టడికి ఇదొక్కటే మార్గమని ప్రధాని, రాష్ట్రాల సీఎంలు కోరుతున్నారు. కానీ కుటుంబ పోషణ కోసం నగరాలకు వలస వెళ్లిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. వెళ్లడానికి బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోవడంతో కొందరు కంటెయినర్లలో దాక్కొని సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. మరి కొందరైతే.. కాలినడక సొంతూళ్లకు బయల్దేరుతున్నారు.
Samayam Telugu migrant wokers1


కానీ వలస కార్మికులు ఎక్కడికీ వెళ్లొద్దని.. వారు చోటే ఉండేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. చాలా మంది తమ సొంతూళ్లకు పయనం కావడానికి భోజనం, వసతి దొరక్కపోవడం కూడా కారణమే. దీంతో లాక్‌డౌన్ వేళ వారికి ఆహారం, వసతి కల్పించడం కోసం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్) నిధులను వాడుకోవచ్చని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం కేటాయించారు.

నగరాల నుంచి సొంతూళ్లకు వలస పోతున్న కార్మికులకు ఆరోగ్య పరీక్షలు చేయాలని హోం శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిలా శ్రీవాస్తవ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.