యాప్నగరం

Ayodhya: రామ మందిర నిర్మాణంపై అమిత్ షా కీలక ప్రకటన

Amit Shah: రాహుల్ గాంధీ, మమత బెనర్జీలు మైనారిటీల పౌరసత్వాన్ని తొలగించే అంశాన్ని నిరూపించాలని షా సవాలు విసిరారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన పౌరసత్వ సవరణ చట్ట అనుకూల ప్రచారం వేదికగా అమిత్ షా ఆదివారం మాట్లాడారు.

Samayam Telugu 12 Jan 2020, 6:34 pm
పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఈ చట్టంతో దేశంలోని మైనారిటీల పౌరసత్వానికి ప్రమాదమన్న విపక్షాల ఆరోపణలను అమిత్ షా కొట్టి పారేశారు. రాహుల్ గాంధీ, మమత బెనర్జీలు మైనారిటీల పౌరసత్వాన్ని తొలగించే అంశాన్ని నిరూపించాలని షా సవాలు విసిరారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన పౌరసత్వ సవరణ చట్ట అనుకూల ప్రచారం వేదికగా అమిత్ షా ఆదివారం మాట్లాడారు.
Samayam Telugu Amith Sha on Ram mandir


మరోవైపు, అయోధ్యలో నాలుగు నెలల్లో రామమందిర నిర్మాణం చేపడతామని కేంద్ర మంత్రి ప్రకటించారు. ఆకాశాన్ని చిన్నగా చూపగలిగేంత పెద్దదైన రామ మందిర నిర్మాణం చేపడతమని చెప్పారు. బీజేపీ రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకోవడం లేదని ఇటీవల కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనికి అమిత్ షా ఘాటుగా సమాధానమిచ్చారు.

Also Read: సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు.. ఊహించని ట్విస్ట్‌లు బయటికి

వారిని జైలుకు పంపాలా వద్దా?
‘‘రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, మమత అంతా ఏకమై యావత్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం మైనారిటీల పౌరసత్వాన్ని తొలగిస్తుందని ప్రచారం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, మమత బెనర్జీలకు ఈ రోజు నేను సవాలు విసురుతున్నాను. ఈ సవరణ చట్టంలోని ఏ అధికరణలోనైనా పౌరసత్వాన్ని తొలగించే అంశం ఉందని నిరూపించగలరా? అలాంటి నిబంధన సీఏఏలో లేనేలేదు. పౌరసత్వాన్ని అందించే నిబంధనలు మాత్రమే అందులో ఉన్నాయి. జేఎన్‌యూలో దేశానికి వ్యతిరేకంగా కొంతమంది విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. భారత్ వెయ్యి ముక్కలు కావాలని ఆకాంక్షిస్తున్నారు. వారిని జైలుకు పంపించాలా .. వద్దా? కానీ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ వారిని రక్షించాలని అంటున్నారు.’’ అమిత్ షా వ్యాఖ్యానించారు.

Also Read: మరోసారి బరితెగించిన పాక్.. తలలు ఎత్తుకెళ్లిపోయి ఘాతుకం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.