హిమాచల్ప్రదేశ్ ఎన్నికల వేళ ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆగిపోయిన ఓ బస్సును స్వయంగా ఓ కేంద్ర మంత్రి ముందుకు తోశారు. ఇది బిలాస్పూర్ నియోజక వర్గ పరిధిలో చోటుచేసుకుంది. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆ నియోజకవర్గంలో పర్యటించారు. ఆ సమయంలో ఓ ఇరుకు రోడ్డులో బస్సు బ్రేక్ డౌన్ అయింది. దాంతో బస్సు ఆగిపోయింది. దాంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఆ ట్రాఫిక్లో కేంద్రమంత్రి కాన్వాయ్ కూడా చిక్కుకుంది.
దాంతో ఆయన కిందకు దిగి... అసలేం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న వారితో కలిసి బస్సును ముందుకు తోశారు. తర్వాత కొద్దిసేపు బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యాక... అక్కడ నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. అయితే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బస్సు ముందుకు నెట్టిన వీడియో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనురాగ్ ఠాకూర్ ప్రజలకు ఎన్నో హామీలను ఇస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే... అన్ని గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. అలాగే యాత్రా స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రాజెక్ట్ శక్తి పేరుతో రానున్న పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాగా హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు రానున్నాయి. కేవలం 68 స్థానాలకు 400లకు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూాడా విజయ కేతనం ఎగురవేడానికి ప్రయత్నిస్తుంది.
దాంతో ఆయన కిందకు దిగి... అసలేం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం అక్కడున్న వారితో కలిసి బస్సును ముందుకు తోశారు. తర్వాత కొద్దిసేపు బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యాక... అక్కడ నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. అయితే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బస్సు ముందుకు నెట్టిన వీడియో... సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనురాగ్ ఠాకూర్ ప్రజలకు ఎన్నో హామీలను ఇస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే... అన్ని గ్రామాల్లో రహదారులను అభివృద్ధి చేస్తామని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. అలాగే యాత్రా స్థలాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రాజెక్ట్ శక్తి పేరుతో రానున్న పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాగా హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు నవంబర్ 12న జరగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు రానున్నాయి. కేవలం 68 స్థానాలకు 400లకు పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి కూాడా విజయ కేతనం ఎగురవేడానికి ప్రయత్నిస్తుంది.