యాప్నగరం

బాస్ ఈజ్ బ్యాక్: బాధ్యతలు స్వీకరించిన జైట్లీ

ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గురువారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. కిడ్నీ సర్జరీ కారణంగా ఆయన మూడు నెలలపాటు ఆర్థిక శాఖకు దూరంగా ఉన్నారు.

Samayam Telugu 23 Aug 2018, 12:18 pm
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గురువారం తిరిగి బాధ్యతలు చేపట్టారు. కిడ్నీ సర్జరీ కారణంగా ఆయన మూడు నెలలపాటు ఆర్థిక శాఖకు దూరంగా ఉండగా.. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆ బాధ్యతలను పర్యవేక్షించారు. ప్రధాని సలహాతో అరుణ్ జైట్లీకి తిరిగి ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ బాధ్యతలను అప్పగిస్తున్నట్టు రాష్ట్రపతి తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
Samayam Telugu arun jaitley1.


గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. రూపాయి విలువ నానాటికీ దిగజారుతున్న వేళ.. అరుణ్ జైట్లీ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. విధులకు దూరంగా ఉన్నప్పటికీ.. జీఎస్టీ పన్నుల తగ్గింపు తదితర అంశాలపై ఆయన సోషల్ మీడియా ద్వారా విపక్షాలకు దీటైన సమాధానం ఇచ్చారు.
ఆర్థిక శాఖ బాధ్యతలను గోయల్‌కు తాత్కాలికంగానే అప్పగించడంతో.. ఆ శాఖ వెబ్‌సైట్లో మంత్రి ఫొటోను ఉంచలేదు. దీంతో జైట్లీ, గోయల్‌లో ఆర్థిక మంత్రి ఎవరో చెప్పాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీనికి కేంద్రం బదులిస్తూ.. గోయల్ బాధ్యతలను నిర్వహిస్తున్నారని, కానీ బాస్ మాత్రం జైట్లీయే అని తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.