యాప్నగరం

పాక్‌కు అంత సీన్ లేదు:కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

పాక్‌పై మండిపడ్డారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దాయాది దేశానికి యుద్ధం చేసేంత సీన్ లేదన్నారు. అది ఒక చిన్న దేశమని... వాళ్లతో మనకు యుద్ధమేంటన్నారు. పాకిస్థాన్ ఇటీవల జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ బలమేంటో అందరికి తెలుసని... మన దెబ్బకు చైనానే వెనక్కు తగ్గుతోందని చెప్పారు. అలా పోలిస్తే... పొరుగు దేశం ఎంతని అన్నారు.

TNN 14 Feb 2018, 4:37 pm
పాక్‌పై మండిపడ్డారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దాయాది దేశానికి యుద్ధం చేసేంత సీన్ లేదన్నారు. అది ఒక చిన్న దేశమని... వాళ్లతో మనకు యుద్ధమేంటన్నారు. పాకిస్థాన్ ఇటీవల జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ బలమేంటో అందరికి తెలుసని... మన దెబ్బకు చైనానే వెనక్కు తగ్గుతోందని చెప్పారు. అలా పోలిస్తే... పొరుగు దేశం ఎంతని అన్నారు. పైకి మాత్రం యుద్ధమంటు తెగ హడావిడి చేస్తోందన్నారు. డోక్లామ్ సమస్య సమయంలో జరిగిన ఓ ఘటన గురించి కూడా ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
Samayam Telugu union minister dharmendra pradhan comments on pakistan
పాక్‌కు అంత సీన్ లేదు:కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్


డోక్లామ్ వివాదం జరిగే సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నానని... అక్కడికి వచ్చిన ఈస్టర్న్ కమాండ్ చీఫ్‌తో తాను మాట్లాడినట్లు చెప్పారు. డోక్లామ్ విషయంలో ఏమవుతుందని ఆయనను ప్రశ్నించినట్లు చెప్పారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతం భారత మిలిటరీ చాలా బలంగా ఉంది. అది పాకిస్థాన్ అయినా... చైనా అయినా వాళ్లకంటే చాలా బలంగా ఉన్నాం. ఇదో పెద్ద విషయమేం కాదన్నారట. అందుకే చెబుతున్నా.. పాక్‌తో చిన్నపాటి యుద్ధంగా కూడా దీనిని పరిగణించడం లేదు. కాని కవ్విస్తున్న ప్రత్యర్థికి అలాగే సమాధానం చెబుతామని ప్రధాన్ అన్నారు.

#WATCH: Union Minister Dharmendra Pradhan says 'Pakistan ek chhutputiya desh hai' (13.02.2018) #ANIInfracon pic.twitter.com/BQpAMW9xq9 — ANI (@ANI) February 14, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.