యాప్నగరం

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెబ్‌సైట్‌ హ్యాక్‌.. పాక్ నినాదాలు, హెచ్చరికలు

Hyderabad: కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైంది. ఆగస్టు 15 రోజునే హ్యాకర్లు దాడి చేశారు. పాకిస్థాన్ అనుకూల నినాదాలు కనిపించేలా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు చేశారు.

Samayam Telugu 25 Aug 2020, 8:22 pm
హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. కొంత కాలంగా దేశంలోని పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు హ్యాకర్ల బారినపడుతున్నారు. తాజాగా ఆ జాబితాలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేరారు. పాకిస్థాన్‌కు చెందిన హ్యాకర్లు కిషన్‌ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ (kishanreddy.com)ను హ్యాక్‌ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఆయన వెబ్‌సైట్‌ హ్యాక్‌కు గురైంది. కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌లో పాకిస్థాన్‌ అనుకూల నినాదాలు పెట్టారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సందేశాలు పెట్టారు.
Samayam Telugu కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాక్
Kishan Reddy website hacked by pakistan hackers (Representational Image)


కిషన్ రెడ్డి వెబ్‌సైట్ హ్యాకింగ్‌కు గురైన విషయాన్ని హైదరాబాద్‌లోని కిషన్‌ రెడ్డి కార్యాలయం మంగళవారం (ఆగస్టు 25) ధ్రువీకరించింది. హ్యాకింగ్ అయిన విషయాన్ని గుర్తించిన వెంటనే వెబ్‌సైట్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే ‘తాత్కాలికంగా అందుబాటులో లేదు’ అని చూపిస్తోంది.

మంత్రి కిషన్‌ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌లో ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆయన వ్యక్తిగత వివరాలతో పాటు రోజువారీగా ఆయన పాల్గొంటున్న కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉందని తెలిపారు. ఆ వివరావన్నీ పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నవేనని పేర్కొన్నారు. సాంకేతిక నిపుణుల సాయంతో వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ బారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

Also Read: డీఆర్‌డీవో చీఫ్‌గా మరో రెండేళ్ల పాటు సతీశ్ రెడ్డి.. కేంద్రం కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.