యాప్నగరం

కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

Union Cabinet: కేంద్ర మంత్రి పదవికి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీ కాలం రేపటితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. దీన్ని బీజేపీ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 6 Jul 2022, 5:52 pm
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (Mukhtar Abbas Naqvi) రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం (జులై 6) కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాల్గొన్నారు. ఆయనకిది చివరి కేబినెట్ సమావేశం కావడం గమనార్హం. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.
Samayam Telugu ముక్తార్ అబ్బాస్ నఖ్వి (ఫైల్ ఫొటో)
Union Minister Mukhtar Abbas Naqvi resigns


రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి రేపటితో పదవీ కాలం పూర్తవుతోంది. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నుంచి పలువురు నేతలకు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారు. వీరిలో తెలంగాణకు చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ఉన్నారు. నఖ్వీకి కూడా మరోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించి మంత్రిగా కొనసాగిస్తారని భావించారు. కానీ, అలా జరగలేదు. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చారు.

కేబినెట్ సమావేశంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. నఖ్వీ విలువైన సేవలు అందించారని, దేశాభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారని మోదీ పేర్కొన్నట్లు సమాచారం. నఖ్వీతో పాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవీ కాలం కూడా గురువారంతో ముగియనుంది.

ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రేపు జరగబోయే బీజేపీ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.