కర్ణాటకలోని (Karnataka) ఓ ఆలయంలో అమ్మవారిని భక్తులు వింతగా పూజిస్తున్నారు. విచిత్రంగా చెప్పులతో మొక్కుతారు. కలబురిగి జిల్లా అలంద్ తాలుకా గోల గ్రామంలో లక్కమ్మ అమ్మవారి ఆలయం ఉంది. ఈ గుడి చాలా ఫేమస్. సాధారణంగా ఏ గుడిలోనైనా.. భక్తులు కొబ్బరికాయ కొట్టి.. పువ్వులు, ఫలాలు సమర్పించి, దీపాలు పెట్టి పూజిస్తుంటారు. దేవుడి విగ్రహం ఎదురుగా నిల్చుని చేతులెత్తి నమస్కరించి మొక్కుకుంటుంటారు. అయితే ఈ లక్కమ్మ అమ్మవారి ఆలయంలో మాత్రం భక్తులు చాలా వింత సంప్రదాయాలు పాటిస్తుంటారు. ముఖ్యంగా భక్తులు అమ్మవారి వీపు చూస్తూ మొక్కుతారు. అనంతరం చెప్పులను కానుకలుగా అందిస్తారు. ఆ గుడిలో ఇలా చేస్తేనే దేవత తమ కోరికలు తీరుస్తుందని బలంగా విశ్వసిస్తుంటారు. అంతేకాదు ఈ దేవతకి భక్తులు ఒబట్టు అనే వంటకాన్ని నైవేద్యంగా పెడుతుంటారు. మాంసాహారులు మాత్రం కోళ్లు, మేకలను బలిస్తుంటారు. చాలా ఏళ్ల నుంచి అమ్మవారిని ఇలాగే పూజిస్తున్నామని గ్రామస్థులు అంటున్నారు. ఎప్పటినుంచో ఇదే సంప్రదాయం అమల్లో ఉందంటున్నారు.
ప్రతి ఏడాది దీపావళి తర్వాత వచ్చే పంచమి నాడు ఈ అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ ఉత్సవానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అందరూ చెప్పులు కట్టి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఈ అమ్మవారిని భక్తులు కాళికా దేవికి మరో రూపంగా భావించి.. కొలుస్తుంటారు.
ప్రతి ఏడాది దీపావళి తర్వాత వచ్చే పంచమి నాడు ఈ అమ్మవారి జాతర జరుగుతుంది. ఈ ఉత్సవానికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అందరూ చెప్పులు కట్టి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తుంటారు. ఈ అమ్మవారిని భక్తులు కాళికా దేవికి మరో రూపంగా భావించి.. కొలుస్తుంటారు.