యాప్నగరం

మార్నింగ్ వాక్‌కు వెళ్లిన నేతపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి

ఉదయాన్నే లేచి ఆయన పొలంవైపు మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన కొందరు ఆగంతకులు ఒక్కసారిగా ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

Samayam Telugu 11 Aug 2020, 12:13 pm
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొలం వైపు మార్నింగ్ వాక్‌కు వెళ్లిన నాయకుడిపై కొందరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కీలక నేత అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన యూపీలోని బాగ్‌పత్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మాజీ అధ్యక్షుడు సంజయ్‌ ఖోఖర్‌ను ముగ్గురు వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. మంగళవారం ఉదయం తన ఇంటికి దగ్గర్లో ఉన్న పొలంవైపు మార్నింగ్ వాక్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా సంజయ్‌పై కొందరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ప్రమాద స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
Samayam Telugu బీజేపీ నేతపై కాల్పులు
up bjp leader sanjay khokhar shot dead

Read More: బీజేపీ ఎంపీకి బెదిరింపులు.. పాకిస్తాన్‌ నుంచి ఫోన్ కాల్
సంజయ్‌ ఖోఖర్‌ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అంతకు ముందే అతడ్ని హతమార్చేందుకు దుండగులు మాటు వేశారు. అనంతరం ఆయనపై దాడికి తెగబడ్డారు. కాల్పుల్లో ఆయన శరీరంలోకి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయి. వెంటనే అతడు పొలంలో రక్తపు మడుగులో పడిపోయారు. పాతకక్ష్యలే దీనికి కారమై ఉంటుందని అనుమానిస్తున్నారు. కాగా అంతకు ముందు బాగ్‌పట్‌లో ఇదే తరహాలో ఆర్‌ఎల్‌డి సీనియర్ నాయకుడు డెస్ఫాల్ ఖోఖర్ హత్యకు గురయ్యారు. అధికార పార్టీ నేతపై ఇలాంటి దాడి జరగడం సంచలనం రేపింది. దీనిపై పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ఈ ఘటనపై స్పందించారు. వెంటనే విచారణ జరపాలని అధికారుల్ని ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.