యాప్నగరం

యూపీ ఉప ఎన్నికలు బీజేపీకి షాక్..

ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్, ఫూల్పూర్ ఎంపీ సీట్లకు జరుగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్ లో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాకే తగులుతోంది.

TNN 14 Mar 2018, 12:51 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పూర్, ఫూల్పూర్ ఎంపీ సీట్లకు జరుగుతున్న ఉప ఎన్నికల కౌంటింగ్ లో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాకే తగులుతోంది. ఈ రెండు స్థానాల్లోనూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకం అయిన ఈ బై పోల్స్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. పది రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి.. ఎస్పీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతోనే సాగుతూ ఉండటం గమనార్హం.
Samayam Telugu up by election 2018 results big jolt for bjp
యూపీ ఉప ఎన్నికలు బీజేపీకి షాక్..


గోరఖ్ పూర్ లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషద్ దాదాపు ఏడు వేల ఓట్ల మెజారిటీని సాధించాడు. గోరఖ్ పూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి అత్యంత అనుకూలమైన నియోజకవర్గంగా పేరు పొందింది. అక్కడ నుంచి ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పలు మార్లు ఘన విజయం సాధించారు. ఆయన సీఎం గా వెళ్లిపోవడంతో.. ఈ ఉప ఎన్నిక వచ్చింది.

ఇక యూపీ డిప్యూటీ సీఎంగా వెళ్లిన మరో నేత కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాతినిధ్యం వహించిన ఫూల్పూర్ నియోజకవర్గంలో కూడా ఎస్పీ అభ్యర్థి ముందున్నాడు. ఇక్కడ ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ పటేల్ 14 వేల ఓట్ల మెజారిటీతో సాగుతున్నాడు. ఆయనకు 1,11,668 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కుశలేంద్ర సింగ్ పటేల్ కు 97 వేల ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ మద్దతు పలికింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.