సీఎం అఖిలేష్ యాదవ్ కేవలం మనుగడ కోసమే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. ఆదివారం మోదీ అలీఘర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈసారి ఎన్నికల్లో తమ సంక్షేమానికి దోహదపడే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. స్కాముల్లో కూరుకుపోయిన ఎస్పీ,కాంగ్రెస్, బీఎస్పీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అవినీతి, నల్లధనం ఆటకట్టించడానికే పెద్ద నోట్లు రూ.1000, రూ.500లను రద్దు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఆధార్ నెంబరు ఆధారంగా పేదలకు రాయితీలు ఇవ్వనున్నామని మోదీ చెప్పారు.
తాను చేస్తున్న అభివృద్ధి పనులు, తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలను చూసిన ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.
అలీఘర్ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా..వివిధ ప్రాంతాల్లో బీఎస్పీ, ఎస్పీల నేతలు మాయావతి, అఖిలేష్ లు ప్రచారం చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈసారి ఎన్నికల్లో తమ సంక్షేమానికి దోహదపడే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని తాను విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. స్కాముల్లో కూరుకుపోయిన ఎస్పీ,కాంగ్రెస్, బీఎస్పీలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అవినీతి, నల్లధనం ఆటకట్టించడానికే పెద్ద నోట్లు రూ.1000, రూ.500లను రద్దు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఆధార్ నెంబరు ఆధారంగా పేదలకు రాయితీలు ఇవ్వనున్నామని మోదీ చెప్పారు.
తాను చేస్తున్న అభివృద్ధి పనులు, తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలను చూసిన ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.
అలీఘర్ ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా..వివిధ ప్రాంతాల్లో బీఎస్పీ, ఎస్పీల నేతలు మాయావతి, అఖిలేష్ లు ప్రచారం చేశారు.