పాన్ పరాక్, గుట్కాలు తింటే అంతే: సీఎం యోగి
ఉత్తర్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూకుడు మీదున్నారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి మరుసటి రోజే గో సంరక్షణ కోసం
Samayam Telugu 22 Mar 2017, 4:24 pm
ఉత్తర్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూకుడు మీదున్నారు. సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి మరుసటి రోజే గో సంరక్షణ కోసం చర్యలు చేపట్టిన యోగి... కొన్ని ప్రాంతాల్లో కబేళాలకు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా బుధవారం..మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు పాన్ పరాక్, గుట్కాలు వంటివి నమలక కూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పుత్రులు, విద్యాసంస్థల్లో పొగాకు ఉత్పత్తులను నిషేదిచారు. పొగాకు నిమిలినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం యోగి తన అధికారిక కార్యాలయాన్ని సందర్శించినప్పుడు...అక్కడ గోడల మీద పాన్ పరాక్ నమిలి ఉమ్మివేసి గుర్తులు కనిపించడంతో ఆయన తక్షణమే వాటిని విధి నిర్వహణలో, ప్రభుత్వ కార్యాలయాల్లో నమలరాదని ఆదేశించారు.
అంతేకాదు ప్రభుత్వ ఆఫీసులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అధికారులను ఆదేశించారు.
దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల కబేళాలు నిషేదించేలా చర్యలు ప్రారంభించాలని ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు. అయితే ఏ రకమైన కబేళాలు నిషేదించాలన్న విషయంపై ఇంకా పూర్తి తెలియరాలేదు.
గోవులున అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి అధికారులకు చెప్పారు. గోసంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
తాజాగా బుధవారం..మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగులు పాన్ పరాక్, గుట్కాలు వంటివి నమలక కూడదని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పుత్రులు, విద్యాసంస్థల్లో పొగాకు ఉత్పత్తులను నిషేదిచారు. పొగాకు నిమిలినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బుధవారం యోగి తన అధికారిక కార్యాలయాన్ని సందర్శించినప్పుడు...అక్కడ గోడల మీద పాన్ పరాక్ నమిలి ఉమ్మివేసి గుర్తులు కనిపించడంతో ఆయన తక్షణమే వాటిని విధి నిర్వహణలో, ప్రభుత్వ కార్యాలయాల్లో నమలరాదని ఆదేశించారు.
అంతేకాదు ప్రభుత్వ ఆఫీసులను పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని అధికారులను ఆదేశించారు.
దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల కబేళాలు నిషేదించేలా చర్యలు ప్రారంభించాలని ఆయన పోలీస్ శాఖను ఆదేశించారు. అయితే ఏ రకమైన కబేళాలు నిషేదించాలన్న విషయంపై ఇంకా పూర్తి తెలియరాలేదు.
గోవులున అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి అధికారులకు చెప్పారు. గోసంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.