యాప్నగరం

యూపీ కేబినెట్: కీలక శాఖలు యోగి వద్దనే!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసలు పని మొదలుపెట్టారు.

TNN 22 Mar 2017, 6:36 pm
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అసలు పని మొదలుపెట్టారు. మంత్రివర్గంలోని 46 మందికి బుధవారం శాఖలను కేటాయించారు. ఆదిత్యనాథ్ టీంలో మొత్తం 22 మంది మంత్రులకు కేబినెట్ హోదా దక్కగా.. తొమ్మిది మందికి స్వతంత్ర హోదా కల్పించారు. 13 మందిని సహాయ మంత్రులుగా నియమించారు. ఇక కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ డిప్యూటీ సీఎంలనే సంగతి తెలిసిందే. కేశవ్ ప్రసాద్ మౌర్యకు పబ్లిక్ వర్క్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్లను కేటాయించారు.
Samayam Telugu up cm yogi adityanath keeps home and finance ministry
యూపీ కేబినెట్: కీలక శాఖలు యోగి వద్దనే!


మరో డిప్యూటీ దినేశ్ శర్మకు హయ్యర్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్‌మెంట్లు ఇచ్చారు. అయితే కీలకమైన హోం, ఆర్థిక శాఖలను మాత్రం ఆదిత్యనాథ్ తన వద్దే ఉంచుకున్నారు. ఇక రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌కు ఆరోగ్య శాఖ అప్పగించారు. మాజీ క్రికెటర్ చేతన్ చౌహన్‌కు క్రీడల శాఖ కేటాయించారు. ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని ఏకైక ముస్లిం మంత్రి అయిన మొహ్సిన్ రాజాకు మైనారిటీ వ్యవహారాల శాఖ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.