యాప్నగరం

కట్నం కింద బైక్ తీసుకురావా.. మహిళను వివస్త్రను చేసి అత్తింటి వేధింపులు

సమాజంలో మానవత్వం మరిచిపోతున్నారు కొంతమంది మూర్ఖులు. డబ్బు, కామంతో కళ్లు మూసుకుపోయికట్టుకున్న భార్యలకే టార్చర్ పెడుతున్నారు. వివాహేతర సంబంధంతో ఒకడు.. కట్నం తేవాలంటూ ఇంకొకడు. ఇలా ఆడవాళ్లపై అకృత్యాలు చేస్తున్నారు.

Samayam Telugu 14 Jul 2018, 10:01 am
సమాజంలో మానవత్వం మరిచిపోతున్నారు కొంతమంది మూర్ఖులు. డబ్బు, కామంతో కళ్లు మూసుకుపోయికట్టుకున్న భార్యలకే టార్చర్ పెడుతున్నారు. వివాహేతర సంబంధంతో ఒకడు.. కట్నం తేవాలంటూ ఇంకొకడు. ఇలా ఆడవాళ్లపై అకృత్యాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ అలాంటిదే దారుణమైన ఘటన జరిగింది. కట్నం కింద బైక్ తీసుకురాలేదనే కోపంతో ఓ మహిళను దారుణంగా హింసించారు అత్తింటవాళ్లు. ఆమెను నిర్భందించి వివస్త్రను చేసి.. నరకం చూపించారు. ఎలాగో వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఘోరం బయటపడింది.
Samayam Telugu Dowry


ఫిరాజోబాద్ జిల్లా గడిబహుకు చెందిన రవికి కుషాల్‌పూర్‌కు చెందిన యువతితో ఐదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. అయితే కొద్దిరోజులుగా కట్నం తీసుకురాలేదంటూ ఆమెపై వేధింపులు మొదలయ్యాయి. బైక్ తీసుకురావాలంటూ ఆమెను రోజూ టార్చర్ పెట్టేవాళ్లు. ఈ క్రమంలోనే గత శనివారం ఆమె ఇంట్లో నిద్రిస్తోంది. భర్త రవి తన సోదరులు రాము, భోలా.. తోబుట్టువులు అంజు, మంజు.. వాళ్ల భర్తలతో కలిసి మంచానికి కట్టేశారు. ఆమెను వివస్త్రను చేసి దారుణంగా ప్రవర్తించారు. ఆ నీచులు ఓ గంటెను ఎర్రగా కాల్చి శరీరమంతా వాతలు పెట్టారు.

అత్తింటివారు ఆమెను మంచానికే కట్టేయడంతో బయటపడలేకపోయింది. మెల్లిగా వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటికి చేరింది. తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటి వేధింపులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితురాలని వైద్యం కోసం ఆస్పత్రికి పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని నిందితుల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.