యాప్నగరం

అసెంబ్లీలో రభస మధ్యే కునుకు తీసిన ఎమ్మెల్యేలు

లోకం ఏమైపోయినా పర్వాలేదు.. మా నిద్రే మాకు ముఖ్యం అన్నట్టుంది ఈ ఎమ్మెల్యేల తీరు. ఓవైపు...

TNN 16 May 2017, 10:57 am
లోకం ఏమైపోయినా పర్వాలేదు.. మా నిద్రే మాకు ముఖ్యం అన్నట్టుంది ఈ ఎమ్మెల్యేల తీరు. ఓవైపు అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగుతోంది.. మరోవైపు ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టి నానా రభస చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల వాదోపవాదనలతో అసెంబ్లీ అంతా గందరగోళంగా వుంటే, ఇదిగో వీళ్లు మాత్రం తాము బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనడానికి రాలేదు.. స్లీపింగ్‌కే వచ్చామన్నట్టుగా ఏంచక్కా ఓ కునుకుతీశారో చూడండి!
Samayam Telugu up mlas caught sleeping in lok bhawan
అసెంబ్లీలో రభస మధ్యే కునుకు తీసిన ఎమ్మెల్యేలు


రభస చేస్తున్న తోటి సభ్యులతో తమకేం సంబంధం లేదనట్టుగా వీళ్లు కునుకుతీసిన తీరు చూస్తోంటే... సభ్యుల నినాదాలే వీళ్లకి జోలపాటగా అనిపించిందేమో కాబోలు అని అనిపిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి సమావేశాల్లో, తొలిరోజైన సోమవారం కనిపించిన సీన్ ఇది.

పరిపాలనలో పారదర్శకత వుండాలనే ఉద్దేశంతో తొలిసారిగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ని లైవ్ ప్రసారం చేసేందుకు అనుమతించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారో చూసే అవకాశం ప్రజలకి ఇవ్వాలనేది యోగి యోచన. కానీ తీరా టీవీల ముందు కూర్చుని చూసిన జనాలకి ఇదిగో ఈ స్లీపింగ్ సీన్ కనిపించింది. అన్నట్టు ఇక్కడ నిద్ర మత్తులో జోగుతున్న వారిలో ఆ రాష్ట్ర మంత్రి కూడా ఉన్నారండోయ్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.