యాప్నగరం

యూపీ అశ్వికదళానికి రక్షణ కవచాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో బీజేపీ ఎమ్మెల్యే బారిపడి కాలుపోగొట్టుకున్న పోలీస్ గుర్రం శక్తిమాన్ ఘటనతో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది.

TNN 20 Mar 2016, 8:32 pm
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్లో బీజేపీ ఎమ్మెల్యే బారిపడి కాలుపోగొట్టుకున్న పోలీస్ గుర్రం శక్తిమాన్ ఘటనతో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. ఉత్తరాఖండ్ కు పొరుగునే ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రపు పోలీసు గుర్రాలన్నింటికి ఇకపై రక్షణ కవచాలు రానున్నాయి. ఆందోళనకారుల చేతుల్లో పడి ప్రాణాలు కోల్పోకుండా, వైకల్యం బారిన పడకుండా వాటికి ఈ కవచాలు ఏర్పాటుచేసేందుకు యూపీ ప్రభుత్వంనిర్ణయించింది. తొలుత ఆ రాష్ట్రంలోని 330 గుర్రాలకు రక్షణ కవచాలు ఏర్పాటుచేయనున్నారు. కవచాలతోపాటు గుర్రాల కళ్లకు అద్దాలు కూడా పెట్టనున్నామని ఆ రాష్ట్ర డీజీపీ జావేద్అహ్మద్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.