యాప్నగరం

మోడీ బర్త్‌డే.. ఆదివారం స్కూల్‌‌కి రావాల్సిందే!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ

TNN 8 Sep 2017, 11:01 am
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టిన రోజు సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకూ సెప్టెంబర్ 17(ఆదివారం) వర్కింగ్ డే నే అని ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.ఈ మేరకు యూపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మోడీ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం అయినప్పటికీ సెప్టెంబర్ 17న విద్యార్థులు, టీచర్లు స్కూళ్లకు హాజరు కావాల్సిందే.. ప్రతి పాఠశాలలోనూ మోడీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాల్సిందే అని యూపీ ప్రభుత్వం ఆదేశించింది.
Samayam Telugu up primary kids told to be in school without fail for pms birthday
మోడీ బర్త్‌డే.. ఆదివారం స్కూల్‌‌కి రావాల్సిందే!


విద్యార్థులకు మోడీ గొప్పదనం గురించి టీచర్లు వివరించాలని, మోడీ పుట్టిన రోజు సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛభారత్ ఆవశ్యకతను వివరించాలని.. కూడా విద్యాశాఖ ఆదేశించింది. ఆ రోజున స్కూళ్లలో పిల్లలకు మిఠాయిల పంపకం కూడా ఉంటుందని పేర్కొన్నారు.

మరి పదవిలో ఉన్న ప్రధానమంత్రి పుట్టిన రోజు వేడుకలను ప్రభుత్వ పాఠశాలల్లో జరపడం, అందునా ఆదివారం అయినప్పటికీ పిల్లలు విధిగా పాఠశాలలకు రావాలని పేర్కొనడాన్ని బీజేపీ యూపీ విభాగం సమర్థించుకుంది. మోడీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించి, పిల్లలకు ఆ రోజున స్వచ్ఛభారత్ ఆవశ్యకతను వివరించడం ప్రధానికి రాష్ట్రం ఇచ్చే కానుక అని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధానమంత్రి మోడీ విద్యార్థుల మార్గదర్శకుడని యూపీ బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.