అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ మహిళ తన కన్నతల్లినే కడతేర్చింది. ఆమెకు మత్తుపానీయం ఇచ్చి ప్రియుడితో కలిసి గొంతునులిమి చంపేసింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో చోటు చేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్నగర్కు చెందిన ఇషావతి అనే 40 ఏళ్ల ఓ మహిళ గత శనివారం (జనవరి 5) తన నివాసంతో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు.
ఇషావతి మృతదేహం పక్కనే ఆమె కూతురు నీలం కూడా అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీలంను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇషావతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారని.. తమకు మత్తు మందు ఇచ్చి తన తల్లిని చంపేశారని పోలీసులతో నీలం చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు తొలుత ఇషావతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత నీలం ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం, ఆమె చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఇషావతి కూతురు నీలం ముజఫర్నగర్కు చెందిన మను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఇషావతి తన కుమార్తెను మందలించింది. తన ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించింది. కానీ, తీరు మార్చుకోని నీలం తన ప్రియుడితో కలిసి అత్యంత హేయమైన నిర్ణయం తీసుకుంది. తన రాసలీలలకు అడ్డు వస్తున్న తల్లినే చంపడానికి నీలం సిద్ధమైంది.
గత శనివారం నీలం.. మనుతో కలిసి తల్లి ఇషావతికి మత్తుపానీయం ఇచ్చింది. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరూ కలిసి ఆమెను గొంతునులిమి హత్య చేశారు. ఆ సమయంలో ఇషావతి భర్త సుందర్పాల్ ఇంట్లో లేరు. లాయర్గా పనిచేస్తున్న ఆయన విధుల నిమిత్తం కోర్టుకు వెళ్లారు..
ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు అసలు కారణాన్ని గుర్తించి.. నీలం, ఆమె ప్రియడు మనును బుధవారం అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. వివాహేతరం సంబంధం కోసం పేగు పంచిచ్చిన కన్నతల్లినే కడతేర్చిన నీలంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇషావతి మృతదేహం పక్కనే ఆమె కూతురు నీలం కూడా అపస్మారక స్థితిలో పడి ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నీలంను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇషావతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారని.. తమకు మత్తు మందు ఇచ్చి తన తల్లిని చంపేశారని పోలీసులతో నీలం చెప్పింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు తొలుత ఇషావతిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత నీలం ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం, ఆమె చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో అనుమానం వచ్చి ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
ఇషావతి కూతురు నీలం ముజఫర్నగర్కు చెందిన మను అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఇషావతి తన కుమార్తెను మందలించింది. తన ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించింది. కానీ, తీరు మార్చుకోని నీలం తన ప్రియుడితో కలిసి అత్యంత హేయమైన నిర్ణయం తీసుకుంది. తన రాసలీలలకు అడ్డు వస్తున్న తల్లినే చంపడానికి నీలం సిద్ధమైంది.
గత శనివారం నీలం.. మనుతో కలిసి తల్లి ఇషావతికి మత్తుపానీయం ఇచ్చింది. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇద్దరూ కలిసి ఆమెను గొంతునులిమి హత్య చేశారు. ఆ సమయంలో ఇషావతి భర్త సుందర్పాల్ ఇంట్లో లేరు. లాయర్గా పనిచేస్తున్న ఆయన విధుల నిమిత్తం కోర్టుకు వెళ్లారు..
ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు అసలు కారణాన్ని గుర్తించి.. నీలం, ఆమె ప్రియడు మనును బుధవారం అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. వివాహేతరం సంబంధం కోసం పేగు పంచిచ్చిన కన్నతల్లినే కడతేర్చిన నీలంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.