యాప్నగరం

తనయుడి ‘యాత్ర’, హాజరైన తండ్రి, బాబాయి

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ‘వికాస్ రథయాత్ర’ లక్నోలో అట్టహాసంగా ప్రారంభమైంది.

TNN 3 Nov 2016, 10:38 am
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ‘వికాస్ రథయాత్ర’ లక్నోలో అట్టహాసంగా ప్రారంభమైంది. యాత్ర ప్రారంభోత్సవానికి తండ్రి, సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బాబాయి, ఎస్పీ యూపీ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ లు హాజరయ్యారు.
Samayam Telugu upakhilesh kicks off vikas rath yatra attends mulayam and shivpal
తనయుడి ‘యాత్ర’, హాజరైన తండ్రి, బాబాయి

అఖిలేష్ యాత్ర సక్సెస్ కావాలని ఇద్దరు నేతలు ఆశీర్వదించారు.

మతతత్వ బీజేపీని అడ్డుకోవడం, ఎస్పీని మళ్లీ అధికారంలో తీసుకురావడమే తన యాత్ర లక్ష్యమని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.

లౌకిక పార్టీలు ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని ములాయం సింగ్ పిలుపునిచ్చారు.

కాగా, మూడోసారి రథయాత్రం చేయడం సంతోషంగా ఉందని అఖిలేష్ అన్నారు .

యూపీ ఎన్నికల్లో దేశ రాజకీయాలపై తీవ్రప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. తన యాత్రకు తండ్రి ములాయం, బాబాయ్ శివపాల్ ప్రోత్సాహం మరువలేనిదని చెప్పారు.

సభ ప్రారంభానికి ముందు ఎస్పీకి చెందిన కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు.

కాగా, గత రెండు నెలలుగా ములాయం ఇంట విబేధాలు నెలకొన్న నేపథ్యంలో అఖిలేష్ ఈ యాత్ర ప్రారంభించారు.

అయితే అఖిలేష్ తండ్రి మాటను కాదని యాత్రను ప్రారంభిస్తున్నారని వార్తలు వినిపించాయి.

కానీ ములాయం, అతని తమ్ముడు శివపాల్ లు అఖిలేష్ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరై..తమ కుటుంబంలో ఏలాంటి విబేధాలు లేవనే సంకేతాలిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.