యాప్నగరం

ఉర్జిత్ పటేల్ రాజీనామా.. సుబ్రమణ్య స్వామి కామెంట్

ఉర్జిత్ పటేల్ రాజీనామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఉర్జిత్ రాజీనామా భారత ఆర్థి వ్యవస్థకు, ఆర్బీఐకి, ప్రభుత్వానికి మంచిది కాదని స్వామి వ్యాఖ్యానించారు.

Samayam Telugu 10 Dec 2018, 6:08 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ప్రభుత్వంతో కలహాల కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోన్నా.. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పేర్కొన్నారు. గవర్నర్ పదవి నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు ఉర్జిత్ తన లేఖలో పేర్కొన్నారు. 2016లో ఆర్బీఐ గవర్నర్ పదవిని చేపట్టిన ఉర్జిత్ పటేల్ మూడేళ్లపాటు పదవిలో కొనసాగాల్సి ఉంది. అంటే ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది సెప్టెంబర్‌తో ముగియనుంది. అంతకన్నా ముందే ఉర్జిత్ తన పదవికి రాజీనామా చేశారు.
Samayam Telugu urjit-patel-Swamy


ఇదిలా ఉంటే, ఉర్జిత్ పటేల్ రాజీనామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఉర్జిత్ రాజీనామా భారత ఆర్థి వ్యవస్థకు, ఆర్బీఐకి, ప్రభుత్వానికి మంచిది కాదని స్వామి వ్యాఖ్యానించారు. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడారు. ‘ఆయన కనీసం జూలై వరకు ఉంటే బాగుండు. అప్పటి మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ విషయంలో ఉర్జిత్ పటేల్‌ని ప్రధానమంత్రి సంప్రదించాలి. కారణాలు అడిగి తెలుసుకోవాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉర్జిత్ వెళ్లిపోకుండా అడ్డుకోవాలి’ అని స్వామి పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.