యాప్నగరం

Uttar Pradesh: కడుపు నొప్పితో హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇలాంటి కేసు నెవ్వర్ బిఫోర్ అంటున్న డాక్టర్లు!

Uttar Pradesh: తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ యవకుడిని పరీక్షించిన డాక్టర్లు.. సర్జరీ నిర్వహించి అతడి కడుపులో నుంచి 63 మెటల్ స్పూన్లను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత కూడా ఆ పేషెంట్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. ప్రస్తుతం ఐసీయూలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడని డాక్టర్లు తెలిపారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 29 Sep 2022, 8:25 pm

ప్రధానాంశాలు:

  • కడుపునొప్పితో హాస్పిటల్ పాలైన యువకుడు
  • ఎక్స్‌రే తీయగా కడుపులో స్పూన్లు ఉన్నట్టు గుర్తింపు
  • రెండు గంటలపాటు శ్రమించి వెలికితీసిన డాక్టర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Surgery
సర్జరీ- ప్రతీకాత్మక చిత్రం
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు తీవ్రమైన కడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లకు అనుమానం వచ్చి ఎక్స్‌రే తీయించగా.. అతడి కడుపులో మెటల్ పదార్థాలు ఏవో ఉన్నట్టు గుర్తించారు. దీంతో రెండు గంటలపాటు శ్రమించి అతడి కడుపులో నుంచి 63 స్పూన్లను బయటకు తీశారు.
ఆపరేషన్ చేసిన తర్వాత విజయ్ అపస్మారక స్థితిలోనే ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 32 ఏళ్ల విజయ్ కుమార్‌ డ్రగ్స్‌కు అడిక్ట్ కావడంతో.. ఏడాది క్రితం ఓ డీ-అడిక్షన్ సెంటర్లో చేర్పించామని.. అక్కడే బలవంతంగా అతడితో స్పూన్లు మింగించి ఉంటారని అతడి సంబంధీకులు అనుమానిస్తున్నారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న అతణ్ని హాస్పిటల్‌లో చేర్పించగా.. స్పూన్లు మింగిన విషయం తెలిసిందన్నారు.

విజయ్‌కు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ రాకేశ్ ఖురానా మాట్లాడుతూ.. ‘‘15 రోజుల క్రితం అతణ్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఎక్స్‌ రే తీయగా.. అతడి కడుపు, పెద్ద పేగుల్లో మెటాలిక్ పదార్థాలేవో ఉన్నట్టు గుర్తించాం. అదే విషయాన్ని పేషెంట్ దగ్గర ప్రస్తావించగా.. తాను స్పూన్లు తిన్నానని చెప్పాడు. రెండు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించాం. ఇలాంటి సర్జరీని మేమెప్పుడూ చేయలేదు’’ అని తెలిపారు.

విజయ్ కుమార్ మింగిన స్పూన్లన్నింటికీ ముందు భాగాన్ని తొలగించారు. ఆ తర్వాతే ఆయన వాటిని మింగగలిగారు. ఇప్పటి వరకూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. కాగా పేషెంట్ స్పూన్లను ఎప్పుడు మింగాడనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని డాక్టర్లు చెప్పారు.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.