యాప్నగరం

గుర్మీత్ రికార్డుకు ఎసరుపెట్టిన యోగి!

దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం అయోధ్య నగరంలో రెండు లక్షల మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నీస్‌ రికార్డు సృష్టించనుంది.

TNN 18 Oct 2017, 4:21 pm
దీపావళి సందర్భంగా బుధవారం సాయంత్రం అయోధ్య నగరంలో రెండు లక్షల మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం గిన్నీస్‌ రికార్డు సృష్టించనుంది. బుధవారం సాయంత్రం సరయు నదీతీరంతో పాటు అయోధ్య నగరంలో ఏకంగా రెండు లక్షల మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించి డేరా బాబా గుర్మీత్‌ సింగ్‌ సృష్టించిన రికార్డును అధిగమించనున్నారు. 2016 సెప్టెంబర్‌ 23న సిర్సాలోని డేరా సమీపంలో డేరా బాబా 1,50,009 దీపాలు వెలిగించి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు. అయోధ్య దివ్య దీప్‌ ఉత్సవాల్లో భాగంగా గుర్మీత్‌ రికార్డు చెరిగిపోనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ రామ్‌ నాయక్‌లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు.
Samayam Telugu uttar pradesh government plans grand diwali celebration in ayodhya
గుర్మీత్ రికార్డుకు ఎసరుపెట్టిన యోగి!


సరయు ఘాట్‌, రామ్‌కీ పౌరి ఘాట్‌, రామ్‌కథా పార్క్‌ అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ దీపారధనలో యోగి తొలి దీపాన్ని వెలిగిస్తారు. ఆ తర్వాత వివిధ కళాశాలలకు చెందిన 2 వేల మంది విద్యార్థులు, ఎన్‌సీసీ సభ్యులు వీటిని వెలిగించనున్నారు. సీఎం, గవర్నర్‌తో పాటు పలువురు మంత్రులు సాయంత్రం 6.30 నిమిషాలకు నిర్వహించనున్న హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం దీపోత్సవం నిర్వహించడంపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓ పక్క గోరఖ్‌పూర్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఎందరో చిన్నారులు మృత్యువాతపడుతుంటే ఇప్పుడు ఈ గిన్నీస్‌ రికార్డులు అవసరమా అని మండిపడుతున్నారు.

The Uttar Pradesh government, led by Chief Minister Yogi Adityanath, is eyeing the Guinness World Record by lighting around two lakh diyas on the banks of the Saryu River in Ayodhya on the occasion of Diwali. CM Yogi Adityanath will arrive in Ayodhya today to attend the historic event, which is being called ‘Deepotsav’. The Uttar Pradesh government placed orders for two lakh earthen lamps for ‘Deepotsav’ in Ayodhya.The Uttar Pradesh government scheduled a series of programmes to celebrate Diwali in Ayodhya. The government will organise ‘Deepotsav’ on the ‘Ram Ki Paidi’ where 1.71 lakh earthen lamps will be lit.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.