యాప్నగరం

ఐదో పెళ్లికి సిద్ధమైన తండ్రి.. చితకబాదిన పిల్లలు, ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు

ఏకంగా ఐదో పెళ్లికి సిద్ధమైన కాంట్రాక్టర్.. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన రెండో భార్య సంతానం. అతడ్ని బంధువులతో కలిసి చితబాది పోలీసులకు అప్పగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘటన.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 1 Sep 2022, 9:23 am

ప్రధానాంశాలు:

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Uttar Pradesh Wedding
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకోగా.. ఏడుగురు సంతానం ఉన్నారు. ఈ విషయం తెలిసి రెండో భార్య పిల్లలు ఈ పెళ్లిని అడ్డుకున్నారు. యూపీలోని సీతాపుర్‌ జిల్లాల మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల ఓ వ్యక్తి రోడ్డు కాంట్రాక్టర్‌. ఇప్పటికే ఆయనకు నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నాడు.. వీరికి ఏడుగురు సంతానం. కాంట్రాక్టర్ గత ఆరునెలల నుంచి రెండో భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చాడు.

అక్కడితో ఆగకుండా రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు.. ఆయన కూతురు చెబుతున్నారు. మంగళవారం రాత్రి రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధమయ్యాడు. ఈ విషయం తన రెండో భార్య, పిల్లలకు తెలియడంతో అందరూ వెళ్లి వివాహం జరుగుతున్న ప్రాంతానికి బంధువులతో సహా వచ్చి అడ్డుపడ్డారు. భార్య, పిల్లలు పెళ్లి కుమారుడిగా ముస్తాబైన అతడిని చితకబాదారు.. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అవాక్కైన రైన వధువు అక్కడి నుంచి భయపడి పారిపోయింది.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.