యాప్నగరం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

TNN 5 May 2017, 1:43 pm
ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా, మరో 24 మంది గాయపడ్డారు. ఓ వివాహానికి హాజరైన 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన మినీ వ్యాన్ ఎటా జిల్లాలోని సరైనీమ్ గ్రామ సమీపంలో కాల్వలో బొల్తా పడింది. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదంతో గాయపడిన క్షతగ్రాత్రులను ఆగ్రా హాస్పిటల్‌కు తరలించినట్లు జిల్లా కలెక్టర్ అమిత్ కిశోర్ తెలిపారు.
Samayam Telugu uttar pradesh road accident 14 was killed
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి


క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. బాధితులంతా ఆగ్రాకు చెందిన వారేని పేర్కొన్నారు. ఫతేబాద్ రోడ్డులోని కుందల్ నగరీయ గ్రామం నుంచి తిరిగి వస్తుండా మలుపు వద్ద అదుపు తప్పిన వ్యాన్ కాల్వలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి జిల్లా కలెక్టర్, సీనియర్ ఎస్పీ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని కలెక్టర్ అమిత్ కిశోర్ ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.