ఢిల్లీ: ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ మంగళవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి హాజరైన రావత్ పై సీబీఐ అధికారులు ప్రశ్నల
వర్షం కురిపించారు. మార్చి నెలలో నిర్వహించిన అసెంబ్లీ బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు హరీష్ రావత్ ప్రయత్నించారని ఆరోపిస్తూ ..దీనికి సంబంధించిన వీడియో క్లిప్లింగులు సైతం బీజేపీ నేతలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.... విచారణకు రావాల్సిందిగా సీఎం హరీష్ రావత్ కునోటీసులు జారీ చేసింది. సీబీఐ నోటీసలుు అందుకున్న ఆయన మంగళవారం విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఇది తనపై జరిగిన కుట్రగా హరీష్ రావత్ ఆరోపిస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని.. నిజా నిజాలు త్వరలోనే బయటపడతాయని వెల్లడించారు.
వర్షం కురిపించారు. మార్చి నెలలో నిర్వహించిన అసెంబ్లీ బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు హరీష్ రావత్ ప్రయత్నించారని ఆరోపిస్తూ ..దీనికి సంబంధించిన వీడియో క్లిప్లింగులు సైతం బీజేపీ నేతలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ.... విచారణకు రావాల్సిందిగా సీఎం హరీష్ రావత్ కునోటీసులు జారీ చేసింది. సీబీఐ నోటీసలుు అందుకున్న ఆయన మంగళవారం విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఇది తనపై జరిగిన కుట్రగా హరీష్ రావత్ ఆరోపిస్తున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని.. నిజా నిజాలు త్వరలోనే బయటపడతాయని వెల్లడించారు.