యాప్నగరం

లాంచీలో కేబినెట్ సమావేశం

బోటులో కేబినెట్ సమావేశం ఏంటని షాకవుతున్నారా... మీరు చూస్తున్నది నిజమే... దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందనే కదా మీ డౌటు ఉత్తరాఖండ్‌లో.

Samayam Telugu 16 May 2018, 8:30 pm
బోటులో కేబినెట్ సమావేశం ఏంటని షాకవుతున్నారా... మీరు చూస్తున్నది నిజమే... దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందనే కదా మీ డౌటు ఉత్తరాఖండ్‌లో. తెహ్రీ సరస్సులో ప్రత్యేకంగా అలంకరించిన బోటులో సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ అధ్యక్షతన మంత్రులంతా సరదాగా విహరిస్తూ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. పాలనపరమైన అంశాలను చర్చించి... అక్కడే కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ బోటు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Samayam Telugu UttaraKhand


ఈ కేబినెట్ సమావేశాన్ని ఇలా బోటులో నిర్వహించడానికి మరో కారణం ఉందట. త్వరలో తెహ్రీ లేక్ ఫెస్టివల్ జరగనుంది. ఆ ప్రాముఖ్యతను ప్రజలకు చాటిచెప్పేలా... పర్యాటకుల్ని కూడా ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడీ వెరైటీ కేబినెట్ సమావేశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.