యాప్నగరం

వడోదర ఘటనపై విచారణకు ఆదేశం

షారూఖ్ ఖాన్ తాజా చిత్రం ‘రయీస్’ ప్రచార సమయంలో ఓ అభిమాని మరణించిన సంగతి తెలిసిందే.

TNN 24 Jan 2017, 6:47 pm
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తాజా చిత్రం ‘రయీస్’ ప్రచార సమయంలో ఓ అభిమాని మరణించిన సంగతి తెలిసిందే. చిత్ర ప్రచారం కోసం ముంబై నుంచి ఢిల్లీకి అగస్ట్ కాంతి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన షారూఖ్ ఖాన్ మార్గమధ్యంలో వడోదర రైల్వే స్టేషన్‌లో ఆగారు. అతడిని చూసేందుకు అభిమానులు తోసుకున్నారు. ఆ తోపులాటలో 50ఏళ్ల అభిమాని గుండెపోటుతో మరణించాడు. అనేక మంది గాయపడ్డారు. దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. ప్రైవేటు కార్యక్రమాలకు రైళ్లను, రైల్వే స్టేషన్లను ఎలా ఉపయోగించుకోవడానికి ఇచ్చారని ఘాటు విమర్శలు వచ్చాయి. కాగా రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు స్పందించారు. వడోదర స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఆయన స్పందించారు. రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనపై వెంటనే విచారణ ప్రారంభించాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించారు. రైల్వే స్టేషన్‌లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయా అన్న అంశంలో కూడా విచారణ చేయాలని ఆయన ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.