యాప్నగరం

ఎయిమ్స్ హెల్త్ బులిటెన్: నిలకడగా వాజ్‌పేయి ఆరోగ్యం..

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను ఎయిమ్స్, ఢిల్లీ విడుదల చేసింది. వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్య బృందం ప్రకటించింది.

TNN 12 Jun 2018, 12:38 pm
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను ఎయిమ్స్, ఢిల్లీ విడుదల చేసింది. వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్య బృందం ప్రకటించింది. ఆయన మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధ పడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మంగళవారం ఉదయం వరకు ఆయణ్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచనున్నట్లు తెలిపారు. వాజ్‌పేయి బాగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వాజ్‌పేయి అనారోగ్యం క్షీణించడంతో సోమవారం (జూన్ 11) ఉదయం ఆయణ్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించిన విషయం తెలిసిందే.
Samayam Telugu bihari


వాజ్‌పేయి చికిత్స పొందుతున్న ఎయిమ్స్ ఆస్పత్రికి ప్రధాని మోదీ సహా రాజకీయ నేతలందరూ క్యూ కట్టడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎయిమ్స్ హెల్త్ బులిటెన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాజ్‌పేయి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో బీజేపీ శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హోం మంత్రి రాజ్‌నాథ్, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లిన ప్రధాని మోదీ సుమారు గంట సేపు ఆస్పత్రిలోనే ఉన్నారు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.